ఈ మద్య మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయని రోజు వార్తల్లో చదువుతూనే ఉన్నాం. ఓ వైపు మహిళలను రక్షించాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు..కానీ ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఆడవారిపై అఘాయిత్యాలు, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముంబాయిలోని ప్రముఖ మోడల్, సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న రాజస్థాన్ భామ మానసి దీక్షిత్ (20) దారుణహత్యకు గురైంది. రాజస్థాన్ కోట ప్రాంతానికి చెందిన మానసి దీక్షిత్ మోడల్గా మంచి పేరు సంపాదించుకుంది. ఆరు నెలల క్రితం ఆమె ముంబైకి వచ్చింది. అంధేరిలో నివాసముంటుంది.
ఈ నేపథ్యంలో మానసికి అదే ప్రాంతానికి చెందిన ముజమ్మిల్ సయ్యదే అనే 19 ఏళ్ల యువకుడితో స్నేహం ఏర్పడింది. వీరిద్దరి మధ్యా స్నేహం ఏర్పడింది. ఏం గొడవ జరిగిందో ఏమోకానీ, ఆమెను దారుణంగా హత్య చేసిన సయ్యద్, బ్యాగులో మృతదేహాన్ని కుక్కి, మలాద్ ప్రాంతంలో ఉన్న మైండ్ స్పేస్ వద్ద చెత్తలో పడేశాడు. అక్కడి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి ఆ మృతదేహం మానసిదని తేల్చారు. టనే అక్కడున్న సీసీ టీవీ ఫుటేజ్లను పరిశీలించారు.
దీంతో ఓ క్యాబ్లో వచ్చిన సయ్యద్.... మానసి డెడ్ బాడీని అక్కడ పడేసినట్లు గుర్తించారు.క్యాబ్ డ్రైవర్ను విచారించిన పోలీసులు అతడు చెప్పిన వివరాల ప్రకారం సయ్యద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన గొడవలతోనే... మానసి హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. తన అందచందాలతో సోషల్ మీడియాలో వేలాదిమందిని ఆకట్టుకున్న మానసి హత్యకు గురవ్వుడంతో ఆమె అభిమానులంతా ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.