ఆ మద్య టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ అంటూ పెను సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డి ప్రస్తుతం చెన్నైలో ఉంటుంది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగా జరుగుతుందని..సినిమాల్లో నటించడానికి వచ్చిన ఎంతో మంది అమాయక యువతులను ట్రాప్ లో పడేసి దారుణంగా వాడుకుంటున్నారని..పడక సుఖం అందిస్తేనే సినిమా చాన్స్ లు అంటూ మభ్యపెడుతున్నారని ఆరోపించింది. అలాంటి వారి చేతుల్లో తాను కూడా బలైపోయానని పలువురి ఫోటోలు కూడా రిలీజ్ చేసింది. శ్రీరెడ్డి ఉద్యమానికి మరింత బలం చేకూరే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో ఆమె కొంత కాలం ఇంటికే పరిమితం అయ్యారు.
ఈ మద్య ఓ సినిమాలో ఛాన్స్ రావడంతో చెన్నైవెళ్లారు..అక్కడ నుంచి సోషల్ మీడియాలో పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ మద్య లారెన్స్ తీస్తున్న సినిమాలో ఛాన్స్ వచ్చిందని..అడ్వాన్స్ కూడా ఇచ్చారని..దాన్ని తిత్లీ తుఫాన్ బాధితులకు విరాళంగా ఇస్తున్నానని పోస్ట్ చేసింది. టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లో నిలిచింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో, కొన్నాళ్ల క్రితం తాను ప్రకటించిన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా నిర్మాణం పనులను కూడా దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేగవంతం చేస్తున్నారు.
‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రలో శ్రీరెడ్డి నటించబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందుకు జరిగిన అంశాలతో తాను సినిమా చేయబోతున్నట్లు కేతిరెడ్డి గతంలో ప్రకటించాడు. అయితే ఇప్పుడు శ్రీరెడ్డి టైటిల్ రోల్ పోషిస్తుందనే వార్త వివాదాలకు దారి తీసింది.అయితే లక్ష్మి పార్వతి పాత్రలో శ్రీరెడ్డి ఏ మేరకు రాణిస్తుందో చూడాలి. త్వరలోనే ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి కేతిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.