ఈ నెల 7వ తారీఖున హైదరాబాద్ లోని ఎల్ బి స్టేడియం లో జరుగబోతున్న ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’  ఎపిఎన్జిఓల సభకు సమైక్యవాదులను ఆకర్షించేలా ఆసభ నిర్వాహకులు  పవన్ కళ్యాణ్  ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’  సినిమాలోని డైలాగ్ సీన్ ను వాడుకుని సంచలనం సృష్టిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ చెప్పిన డైలాగు  ‘పోరాడితే  పోయేది ఏమి  లేదు, బానిస సంకెళ్ళు తప్ప, నువ్వు హైదరాబాద్ వస్తున్నావు అంతే’ అంటూ పవన్ చెప్పే పవర్ ఫుల్ పంచ్ డైలాగ్ ఈ సభకు సంబంధించి   ప్రజలను ఆకర్షించడానికి ప్రసారం చేస్తున్న ప్రచార ప్రకటనలలో ఉపయోగించుకోవడం టాక్  ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు సమైఖ్య ఆంధ్రాకు కాని, తెలంగాణాకు కాని మద్దతుగా మాట్లాడకపోయినా ఆయన సినిమా కోసం చెప్పిన డైలాగ్ సమైఖ్య ఉద్యమానికి అనుకూలంగా జరిగే సభకు వాడుకోవడం యాదృచ్చికం అనుకోవాలి. గత సంవత్సరం విడుదలైన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ సినిమాలో తెలంగాణా వాదులకు భంగ పరిచే డైలాగ్స్ ఉన్నాయి అంటూ నానా రభస జరిగి తెలంగాణా ఉద్యమకారుల కోపానికి గురై రెండురోజులు తెలంగాణా ప్రాంతంలో ఈ సినిమా చాలా కష్టాలు పడి చివరికి గట్టెక్కింది, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించడం జరిగింది.

మరి అటువంటి విమర్శలు ఎదుర్కున్న సినిమాలోని డైలాగ్స్ ను వాడు కుంటూ తిరిగి అదే తెలంగాణా ప్రాంతంలో నిర్వహించబోతున్న సభ ఎలా జరుగ బోతుందో అనే ఆత్రుత అందరిలోనూ ఉంది. ఇప్పటికే ‘అత్తారింటికి దారేది’ సినిమాకు దారి దొరకక ఇబ్బంది పడుతున్న పవన్ కు ఆయన డైలాగ్స్ వాడుకుంటున్న ఈ సమైక్య వాద సభ ఎటువంటి సమస్యలు తెచ్చి పెడుతుందో చూడాలి.....

 

మరింత సమాచారం తెలుసుకోండి: