తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటి వరకు హీరోగా మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘సవ్యసాచి’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
మాధవన్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ మంచి రెస్పాన్స్ వస్తుంది. నవంబర్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్రయూనిట్.. తాజాగా చిత్రంలోని ‘నిన్ను రోడ్డు మీద చూసినది లగ్గాయత్తు’ సాంగ్ ట్రైలర్ విడుదల చేసింది. ఈ సాంగ్ కి కీరవాణి తనదైన బీట్ అందించారు.
నాగచైతన్య, నిధి అగర్వాల్ వేసిన స్టెప్పులు హుషారెత్తిస్తున్నాయి. ఈ పాటను పృథ్వీ చంద్ర, మౌనిమ ఆలపించారు. గతంలో అక్కినేని నాగార్జున నటించిన ‘అల్లరి అల్లుడు’ సినిమాలోని ఈ పాట కుర్రకారును హుషారెత్తించిన విషయం తెలిసిందే.