టాలీవుడ్ లో నాగార్జున తనయుడు నాగ చైతన్య ఈ సంవత్సరం ‘శైలజారెడ్డి అలుడు’ సినిమాతో అలరించాడు. ఈ సినిమా పాజిటీవ్ టాక్ వచ్చినా..అయితే ఈ సినిమాకు ముందు నాగ చైతన్య ‘సవ్యసాచి’ లో నటించాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటి వరకు ఎవరూ చేయని కొత్త కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతుందని దర్శకులు చందూ మొండేటి అంటున్నారు. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య పూర్తి తరహా యాక్షన్, మాస్ హీరోగా కనిపించబోతున్నాడట. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీసినట్లు చెబుతున్నారు.
ఇక తమిళ స్టార్ హీరో మాధవన్ ఈ సినిమాలో విలన్ గా నటించడం విశేషం. మహానటులు నాగేశ్వరరావు ఎన్నో పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. ఆయన తనయుడు నాగార్జున భక్తిరస సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందారు. అయితే పౌరాణిక సినిమాల్లో మాత్రం నటించలేదు. తాజాగా నాగార్జున తనయుడు, నాగచైతన్య.. అర్జునుడిగా నటిస్తున్నాడు. అదేంటీ నాగ చైతన్య ఇప్పుడు పౌరాణిక సినిమాలో నటిస్తున్నాడా పొరపాటే..అర్జునుడికే సవ్యసాచి అనే పేరు కూడా ఉన్నది. సవ్యసాచి సినిమాలో అర్జునుడు గెటప్ లో నాగచైతన్య కాసేపు అలరించబోతున్నాడు.
అర్జునుడికి మరో పేరు సవ్యసాచి..ఒకే సారి రెండు చేతులతో ఆయుధాలు సంధించగల వారిని సవ్యసాచి అంటారు. ఈ సినిమాలో నాగ చైతన్య తన కుడిచేయితో పాటు ఎడమ చేయితో సినిమా కథ నడిపిస్తాడట. అయితే ఈ సినిమాలో సుభద్ర పరిణయం అనే చిన్న ఎపిసోడ్ ఉండబోతున్నది. ఈ ఎపిసోడ్ లో చైతన్య అర్జునుడుగా అలరించబోతున్నాడు. నవంబర్ 1 వ తేదీ ఉదయం 10 గంటలకు దీనికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. నవంబర్ 2 న సినిమా రిలీజ్ కాబోతున్నది. నిధి అగర్వాల్ హీరోయిన్.