జూనియర్ చరణ్ లు రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ లో చిక్కుకోవడంతో 2020 వరకు వీరిద్దరి దగ్గర నుంచి సినిమాలు వచ్చే అవకాసం లేకపోవడంతో ఆ గ్యాప్ ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని మహేష్ తన సినిమాల వేగం పెంచుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతుల నేపధ్యంలో వ్యూహాత్మకంగా అల్లు అరవింద్ దర్శకుడు క్రిష్ ద్వారా నడుపుతున్న రాయబారాలు మహేష్ ను అంతర్మధనంలో పడేస్తున్నట్లు టాక్.

ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది మహేష్ కెరీర్లో 25వ చిత్రం.  ఈ సినిమా పూర్తికాగానే మహేష్ 26వ మూవీ సుకుమార్ దర్శకత్వంలో వచ్చే ఏడాది మార్చి నుండి ప్రారంభం కాబోతోంది. 

ఈమూవీ తరువాత మహేష్ నటించే 27వ మూవీని అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మించబోతున్నట్లు టాక్. ఈసినిమాకు సందీప్ వంగాను దర్శకుడిగా అనుకుంటున్నారని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ ఈప్రాజెక్టులో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. మహేష్ సినిమాకు ఒక అనుభవజ్ఞుడైన దర్శకుడు అవసరం అనే ఆలోచనతో అల్లు అరవింద్ ఉన్నట్లు తెలుస్తోంది. 

అందుకే సందీప్ వంగా స్థానంలో క్రిష్ ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ ను తీస్తున్న నేపధ్యంలో ఈమూవీ పూర్తికాగానే మహేష్ మూవీ గురించి శ్రద్ధ పెడతాడని తెలుస్తోంది. అయితే ఇప్పటికే మహేష్ దర్శకుడు సందీప్ వంగాకు ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చిన నేపధ్యంలో తన మాటను తప్పి క్రిష్ వైపు ఎలా వెళ్ళాలి అన్న అంతర్మధనంలో ప్రస్తుతం మహేష్ ఉన్నట్లు సమాచారం..    



మరింత సమాచారం తెలుసుకోండి: