సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీమణులు విలన్లుగా నటించాలంటే చాలా ఇబ్బందులు పడుతుంటారు. పాత తరం సినిమాల్లో గయ్యాలి అత్తగా సూర్యకాంతం నటించేవారు..అప్పట్లో ఆమెపై విమర్శలు కూడా వచ్చేవని టాక్. మరికొంత మంది నటీమణులు విలన్లుగా కనిపించినా ఒకటీ రెండు సినిమాలతోనే సరిపెట్టుకునే వారు. కానీ కోలీవుడ్ లో వరుసగా విలన్ పాత్రల్లో నటించి దుమ్మురేపుతుంది ప్రముఖ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్. హీరోయిన్ గా తన కెరీర్ మొదలు పెట్టిన వరలక్ష్మి ఆ మద్య ‘విక్రం వేద’లో గ్యాంగ్స్టర్గా నటించి అందరితో షెభాష్ అనిపించుకుంది. అందం, అభినయం ఉన్నప్పటికీ విభిన్నమైన పాత్రలో కనిపించేందుకు ఉత్సాహపడే వరలక్ష్మి విలన్ పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది.
ఇటీవల ‘సండకోళి 2’లో ప్రతినాయికగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో వరలక్ష్మి ఫ్యాక్షన్ మహిళగా చాలా పవర్ ఫుల్ గా కనిపించింది. సినిమా మొదటి నుంచి చివరి క్షణం వరకు రౌద్రంగా కనిపిస్తూ..విలనీజాన్ని చూపించింది. ఈ మద్య ప్రముఖ దర్శకుడు మురుగదాస్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘సర్కార్’సినిమాలో కూడా విలన్ గా నటించింది. అంతే కదు ఆమె పాత్రపై తమిళ నాట కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి.
అదేవిధంగా ధనుష్ నటిస్తున్న ‘మారి 2’లోనూ విలన్ పాత్రలో మెప్పించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా తెరపైకి రానుంది. అంతే కాదు ‘రాజపార్వై’, ‘నీయా 2’సినిమాల్లో కూడా వరలక్ష్మి విలన్ గానే కనిపించబోతుందట. గతంలో హీరోలుగా నటించిన వారు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్లు గా నటిస్తున్నారు. అయితే ఎంతో అందంగా కనిపించే వరలక్ష్మికి ఇప్పుడు కేవలం ప్రతినాయిక పాత్రలు మాత్రమే వస్తున్నాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.