తెలుగు ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’బయోపిక్. తెలుగు చలన చిత్ర సీమలో కళామతల్లికి రెండు కళ్లుగా ఎన్టీఆర్ - ఏఎన్ఆర్ అంటారు. మహానటులు ఎన్టీఆర్ జీవితక కథ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘ఎన్టీఆర్’బయోపిక్ రెండు భాగాలుగా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం పై రోజు రోజుకీ అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ వచ్చేలా చేస్తున్నారు..అందుకే బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ని తీసుకున్నారు.
ఇక ఇప్పుడు ఈ చిత్ర టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలో నటీనటులకు సంబంధించిన ఒక్కో పోస్టర్ రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో బాలకృష్ణ బిజీగా ఉండటంతో షూటింగ్ కి కొంత విరామం ఇచ్చినట్లు ఫిలిమ్ వర్గాల టాక్. ఇప్పటికే కథానాయకుడు షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఇక ఈ చిత్ర టీజర్ డిసెంబర్ 2న విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ వేగంగా జరుగుతున్నాయి.
ఇక ఈ చిత్రంలో నటీనటుల విషయానికి వస్తే..ఏఎన్నార్గా సుమంత్.. నాటి దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డిగా కైకాల.. చంద్రబాబుగా రానా దగ్గుపాటి.. దాసరి నారాయణరావుగా చంద్రసిద్ధార్థ్.. శ్రీదేవిగా రకుల్.. అలనాటి అందాల తార ప్రభగా శ్రీయసరన్.. సావిత్రిగా నిత్యామీనన్..కృష్ణకుమారిగా మాళవిక నయ్యర్.. ఇలా చాలా మంది నటిస్తున్నారు.
ఈ మధ్యే సమంత కూడా ఈ చిత్రంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తుంది. డిసెంబర్ 16న తిరుపతిలో భారీగా ఆడియో వేడుక కూడా జరగబోతుంది. జనవరి 9న "కథానాయకుడు".. 24న "మహానాయకుడు" విడుదల కానున్నాయి. క్రిష్ తన టీజర్ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తారో అని ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.