తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో నందమూరి బాలకృష్ణ. ఇప్పటికీ వంద చిత్రాలు పూర్తి చేసుకున్న బాలకృష్ణ క్షణం తీరిక లేకుండా చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు హిందూపురం ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తూ..మరోవైపు వరుసగా చిత్రాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘ఎన్టీఆర్’బయోపిక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో షరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా తీస్తున్న విషయం తెలిసిందే..‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’.
ఈ రెండు చిత్రాలు జనవరి నెలలో రిలీజ్ చేయబోతున్నారు. సంక్రాంతి పండుగ బాలయ్యకు మంచి సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ బయోపిక్ పూర్తయిన తర్వాత వెంటనే మాస్ దర్శకులు బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్నట్టు ఆ మద్య వార్తలు వచ్చాయి. అయితే జనవరిలో ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ పూర్తి కానుంది. మార్చి నుంచి వినాయక్ తో కలిసి బాలకృష్ణ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సి.కల్యాణ్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయని అంటున్నారు.
ఇదే సమయంలో బోయపాటి కూడా తన కథ పూర్తి చేసుకొని రంగంలతోకి దిగబోతున్నట్లు సమాచారం. ట్విస్ట్ ఏంటంటే ఈ రెండు చిత్రాలు కూడా సమాంతరంగా షూటింగ్స్ పూర్తి చేసుకునే ఏర్పాటు చేసుకుంటున్నారట ఇరువురు దర్శకులు. ఇప్పటికే బోయపాటి, బాలకృష్ణతో ఒక కథ ఓకే చేయించుకుని ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వరుస సినిమాలు చేయడంలో బాలకృష్ణ యువ హీరోలతో పోటీ పడుతుండటం విశేషం.