మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో కేథరిన్ త్రెసాతో ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారు. 2019 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి.


ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ రాబోతున్నాడని తెలుస్తుంది. ఇద్దరు కలిసి రాజమౌళి డైరక్షన్ లో ట్రిపుల్ ఆర్ మూవీ చేస్తున్నారు. ఆ సినిమా కూడా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇక వినయ విధేయ రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ సర్ ప్రైజ్ ఇస్తాడట.


బోయపాటి శ్రీను కూడా ఎన్.టి.ఆర్ తో దమ్ము సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక వినయ విధేయ రామ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈమధ్య వచ్చిన మొదటి సాంగ్ కూడా ఫ్యామిలీ సాంగ్ గా మెగా అభిమానులను అలరించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.


రంగస్థలం తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాం చరణ్ ఈ సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమాలో కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు కూడా నటిస్తున్నారు. విలన్ గా వివేక్ ఒబేరాయ్ నటిస్తున్నాడు. మరి ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: