‘బాహుబలి’ మూవీని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేసి ఆమూవీకి రికార్డ్ కలక్షన్స్ వచ్చేలా చేయడమే కాకుండా ఆమూవీలో నటించిన ప్రభాస్ రానా లను అదేవిధంగా దర్శకుడు రాజమౌళిని నేషనల్ సెలెబ్రెటీలుగా మార్చిన మార్చిన ఘనత బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ కు దక్కుతుంది. ఇతడు ప్రస్తుతం ఒక ప్రముఖ ఛానల్ కోసం నిర్వహిస్తున్న సెలబ్రిటీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి చాల మంచి రేటింగ్స్ వస్తున్నాయి. 
దేశ వ్యాప్తంగా ఉత్కంఠ
స్టార్ వరల్డ్ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈకార్యక్రమం ఇప్పటికే ఐదు సీజన్స్ పూర్తి చేసుకుని ఆరవ సీజన్ రన్ అవుతోంది. ఈ షోలో పాల్గొనే సెలెబ్రెటీల నుండి పలు ఆసక్తికర సమాధానాలు రాబట్టడంతో పాటు వారి పై వచ్చే గాసిప్పుల గురించి రకరకాల ప్రశ్నలు అడిగి ఇరుకున పెట్టడం కరణ్ జోహార్ ప్రత్యేకత.
 రాజమౌళి నుంచి ‘ఆర్ఆర్ఆర్' విషయాలు
ఇలాంటి టాక్ షోలో మన టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ముగ్గురు గెస్ట్ లు సందడి చేయబోతున్నారు. వారే ‘బాహుబలి’ మూల స్తంభాలు రాజమౌళి ప్రభాస్ రానాలు. వీరి ముగ్గురుతోను నిన్న ఒక ఎపిసోడ్ షూట్ చేసిన విషయాన్ని వివరిస్తూ కరణ్ జోహార్  ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వివరించాడు. ‘బాహుబలి టీమ్‌తో నేను గర్వంగా కాఫీ తాగాను’ అంటూ ఈ ముగ్గురితో కలిసి దిగిన ఫోటోను అభిమానులతో షేర్ చేసాడు. 
ప్రభాస్, రానా పెళ్లి గురించి...
దీనితో ఈ షోలో ఈముగ్గురు ఏమి చెప్పబోతున్నారు అన్న ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటికే కరణ్ జోహార్ కు రాజమౌళి ప్రభాస్ లకు మధ్య దూరం పెరిగింది అని వార్తలు వస్తున్న నేపద్యంలో ఆ వార్తలను తీసిపారవేస్తూ ఈముగ్గురు తిరిగి కరణ్ జోహార్ తో తమ సాన్నిహిత్యాన్ని ఇలా చాటుజోవడం ఆశ్చర్యంగా మారింది. అందుకే రాజకీయాలలో సినిమాలలో వ్యాపారాలలో శాశ్విత శత్రువులు సాస్విత్ మిత్రులు ఉండరు అని అంటారు..   



మరింత సమాచారం తెలుసుకోండి: