తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందాల రాశి ఖుష్బూ ఎంతో క్రేజ్ ఉండేది.  ఎంతగా అంటే తమిళ తంబీలు ఖష్బూకి ఏకంగా గుడి కట్టించేశారు.  వాస్తవానికి బాలీవుడ్ హీరోయిన్ అయిన  ఖుష్బూ తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోనే బాగా నటించింది.  ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన  ఖుష్బూ ఆ మద్య పవన్ కళ్యాన్ నటించిన ‘అజ్ఞాతవాసి’చిత్రంలో ముఖ్య భూమిక పోషించింది.  ఓ వైపు మూవీస్ లో నటిస్తూనే..కాంగ్రెస్ పార్టీ లో కొనసాగుతుంది. ఈ మద్య తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రచారం కూడా చేసింది  ఖుష్బూ. 
Related image
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..బాహుబలి చిత్రం పై తనదైన స్టైల్లో స్పందించింది.  ఈ చిత్రంలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటన చూసి నివ్వెరపోయానని..అంతే కాదు వెంటనే ఆమెకు ఫోన్ చేసి తిట్టేశానని చెప్పింది.  ఈ చిత్రంలో శివగామిగా నీ నటన చూసి నాకు జలసీగా ఉందని..ఇంత మంచి క్యారెక్టర్ నీకు వచ్చిందని..అందుకే నాకు జెలసీగా అనిపిస్తోందని కూడా చెప్పేశాను. 
Image result for ramya krishnan kushboo
దానికి రమ్యకృష్ణ థ్యాంక్యూ అని రిప్లై ఇచ్చిందని చెప్పారు.  వాస్తవానికి ఇండస్ట్రీలో తాము హీరోయిన్లుగా నటించే సమయంలో ఎంతో స్నేహంగా ఉండేవారిమని ఇప్పటికే రమ్యకృష్ణ మంచి స్నేహితురాలని చెప్పింది  ఖుష్బూ. ఇద్దరు పిల్లలకి ఒకేసారి పాలిచ్చే సన్నివేశంలో రమ్యకృష్ణ నటనచూసి, నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

ఈ సినిమాకిగాను రమ్యకృష్ణకి నేషనల్ అవార్డు వస్తుందని భావించాను. కానీ నా అంచనాలు మిస్ అయ్యాయని ఆవేదన చెందింది. గతంలో రజినీకాంత్ నటించిన నరసింహ చిత్రంలో నీలాంబరి గా అద్భుతమైన నటన కనబర్చినందుకు కూడా అప్రిషియేట్ చేసినట్లు తెలిపింది ఖుష్బూ. 


మరింత సమాచారం తెలుసుకోండి: