మీటూ ఉద్యమంపై తొలిరోజుల్లోనే గొంతెత్తిన వారిలో సింగర్ చిన్మయి ఒకరు. ఆమె మరోసారి సినీ ఇండస్ట్రీపై బాంబులు పేల్చారు. సినీ పరిశ్రమలోని లైంగిక వేధింపులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తన
గురించి తమిళ సినీ పరిశ్రమకు
చెందిన రాధారవి చేసిన వ్యాఖ్యలను
ఆమె ప్రస్తావించారు.
ఎప్పుడో
14 ఏళ్ల
క్రితం తమళ సినీ రచయిత వైరముత్తు
తనను వేధించారని తాను గతంలో
చెప్పిన విషయాన్ని గుర్తు
చేసింది.
ఆ
కామెట్స్ పై రాధారవి మాట్లాడుతూ
14 ఏళ్ల
క్రితం..
వైరముత్తు
చేసింది ఇంకా గుర్తుందా అని
రాధారవి అంటున్నారని..
అంటే
అది అంత ఇష్టంగా ఉందా అని
వ్యంగ్యంగా అంటున్నారని
విమర్శించింది.
అలాగే
సినీ ప్రముఖుడు నానాపటేకర్
తీరుపైనా మండిపడింది.
అతను
అంతే అని వదిలేస్తా ఎలా అంటోంది
చిన్మయి.
అలాగే
నటి సమంతతో సాన్నిహిత్యం
గురించి కూడా మనసు విప్పింది.
బహుశా..
సమంతాకూ
నాకు పెళ్లయిందనుకుంటా..
అంటూ
సెటైర్లు వేసింది.
పాపాం
ఆమెను చైతు ఖర్మకొద్దీ పెళ్లి
చేసుకున్నాడని సరదాగా కామెంట్
చేసింది.
సినీరంగంలోనే
కాకుండా సమాజంలోనూ బాలికలు,
మహిళలపై
జరుగుతున్న లైంగక వేధింపులపై
చిన్మయి స్వరం పెంచింది.
తనపై
చిన్న తనంలో జరిగిన దాడులనూ
చెప్పుకొచ్చింది.
అలాగే
మనవరాలిని గర్బవతిని చేసిన
తాత గురించి కూడా వివరించింది.
గొంతు
విప్పి చెప్పకపోతే మహిళలపై
లైంగిక దాడులు ఆగబోవంటోంది
సింగర్ చిన్మయి.