సినీ ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు.  ఈ మద్య స్టార్ హీరో, హీరోయిన్ల కూతుళ్లు కూడా హీరోయిన్లు గా ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ముఖ్యంగా బాలీవుడ్ లో ఎక్కువగా నటవారసురాళ్లు వస్తున్నారు.  ఇప్పటి వరకు టాలీవుడ్ ఎంతో మంది వారసులు హీరోలుగా వచ్చారు..కానీ కొద్ది మంది మాత్రమే సక్సెస్ బాటలో నడుస్తున్నారు.  టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లం కొంత శ్రీనివాస్ ‘అల్లుడు శీను’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. 
Image result for bellam konda family
మొదటి సినిమా మాస్ ఎలిమెంట్స్ ఉండటం..స్టార్ డైరెక్టర్, స్టార్ హీరోయిన్ ఉండటంతో సూపర్ హిట్ అయ్యింది.  ఆ తర్వాత కూడా స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చినా పెద్దగా సక్సెస్ అందుకోలేక పోతున్నాయి.  ఈ మద్య ‘కవచం ’సినిమా కూడా బెల్లంకొండ అబ్బాయిని నిరాశ పరిచింది.  ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది.  ప్రస్తుతం తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా మరో సినిమాలో నటిస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.  ఇప్పుడు ఆయన తమ్ముడైన బెల్లంకొండ గణేశ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగంలోకి దిగుతున్నాడు.
Image result for bellam konda family
ఇప్పటివరకూ సొంత సినిమాల నిర్మాణ వ్యవహారాలు చూసుకుంటూ వచ్చిన గణేశ్, హీరోగా కెమెరా ముందుకు వచ్చేస్తున్నాడు.  ఈ నెల 24వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఫణి అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.   ఈ ఏడాది వచ్చిన 'సాక్ష్యం'.. 'కవచం' ఆయనను మరో మెట్టుపైకి తీసుకెళ్లలేకపోయాయి. దాంతో బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: