కియారా అద్వానీ.. చేసింది మూడు సినిమాలే అయినా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది కియారా అద్వానీ.. మొదటి సినిమా భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ గా నిలవడంతో ఆమె రేంజ్ పెరిగింది. ఇపుడు రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామలోనూ నటిస్తోంది. దీనికితోడు తాజాగా అల్లు అర్జున్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసిందట ఈ అమ్మడు.
అలాంటి టాప్ బ్యూటీ.. తాను విజయదేవరకొండ అంటే పడిచస్తానని బాహాటంగా చెప్పేస్తోంది. ఇందుకూ ఓ కారణం ఉంది. విజయ్ దేవరకొండ సినీ జీవితాన్ని మలుపు తిప్పిన అర్జున్ రెడ్డి సినిమా హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో కియారా హీరోయిన్ గా నటిస్తోందన్నమాట. ఈ సినిమాలు తెలుగు తీసిన సందీప్ రెడ్డే హిందీలోనూ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవల కియారా కబీర్ సింగ్ సినిమా గురించి కొన్ని కబుర్లు చెప్పుకొచ్చింది కియారా.. అర్జున్ రెడ్డి సినిమా అంటే తనకు చాలా ఇష్టమని చెబుతో్ంది. ఈ సినిమా హీరో విజయ్ దేవరకొండకు తాను పిచ్చి ఫ్యాన్ను అంటోంది. అర్జున్ రెడ్డిలో విజయ్ నటన అద్భుతమంటూ పొగిడేసింది.
అర్జున్ రెడ్డి హిందీ వెర్షన్లో హీరోయిన్ ఛాన్స్ రావడంతో తాను పొందిన సంతోషం ఇంతా అంతా కాదంటోంది కియారా.. అయితే తెలుగు అర్జున్ రెడ్డికీ.. కబీర్ సింగ్ కూ చాలా తేడా ఉంటుందట. హీరో షాహిత్ కూ తనకూ మధ్య కూడా కెమిస్ట్రీ బాగా పండిందంటోంది కియారా.