ఈరోజు రిలెజైన ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన ఆడియెన్స్ ఎన్.టి.ఆర్ గురించి తెలియని కథను అందరికి చెప్పారంటూ మాట్లాడుకుంటున్నారు. ఇక సినిమాలో ఒకటి రెండు హైలెట్ సీన్స్ అయితే అదిరిపోయాయి.  


ముఖ్యంగా వాటిలో నాగి రెడ్డి, చక్రపాణిలు రామారావుని కృష్ణుడిగా కెవి రెడ్డి ఒప్పించే సన్నివేశం ఒకటి. తోటరాముడిగా కూడా రామారావుని సెలెక్ట్ చేసింది ఆయనే. అందుకే రామారావు మీద ఉన్న నమ్మకంతో కృష్ణుడిగా రామారావు పర్ఫెక్ట్ అని నిర్మాతలతో వాధిస్తాడు. చక్రపాణి, నాగిరెడ్డిలు ససేమీరా అంటారు.  


అయితే సరదాగా సిగరెట్ తాగుదామని బయటకు వెళ్లిన చక్రపాణికి కృష్ణుడి గెటప్లో ఎదురుగా వస్తుంటాడు ఎన్.టి.ఆర్. అలా ఆయన్ను చూసి సాక్ష్యాత్తు శ్రీకృష్ణుడే నేల మీదకు వచ్చాడు అన్నట్టుగా చూపించారు. ఇక అక్కడ పనిచేసే వారు కృష్ణుడిగా ఎన్.టి.ఆర్ ను చూసి కొబ్బరికాయలు కొడతారు.


ఆ ఒక్క సీన్ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరి రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. అయితే అలాంటి సీన్స్ ఎన్.టి.ఆర్ కథానాయకుడులో మరో రెండు మూడు పండి ఉంటే సినిమా ఇంకా బాగా హిట్ అయ్యేది అంటున్నారు. ఆల్రెడీ సినిమా సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి క్రిష్ బాలయ్యతో మరోసారి అదిరిపోయే సినిమా తీశాడని చెప్పుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: