తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన చిత్రాల కన్నా ట్విట్టర్ లో చాలా హాట్ టాపిక్ గా ఉంటున్నారు. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ చిత్రాలంటే ఎంతో క్యూరియాసిటీ ఉండేది. కానీ ఇప్పుడు ఆయన చిత్రాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు అభినులు. కాకపోతే వర్మ తీసే ప్రతి చిత్రం రిలీజ్ కి ముందు నుంచి ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఫోటోలు, లిరిక్స్ ఇటీవల ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ మద్య రాంగోపాల్ వర్మ, కేఏ పాల్ కి మద్య వార్ కొనసాగుతుంది. తాజాగా నేను మీ ఊర్లన్నీ వస్తాను.. మీ అందర్నీ కలుస్తాను అంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాటను అందుకున్నారు.
ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ స్పందిస్తూ.. ఏపీలో జగన్, చంద్రబాబుతోపాటు బీజేపీ, వీహెచ్ పీ, ఆరెస్సెస్ వంటి శక్తులు ఓడిపోతాయని జోస్యం చెప్పారు. ‘మార్చిలో మార్పు, ఏప్రిల్ లో సునామీ, మనదే గెలుపు’ అని కొత్త నినాదం ఇచ్చారు. ప్రజాశాంతి గెలుపు కోసం 50,000 మంది కోఆర్డినేటర్లను నియమించామని అన్నారు. అయితే కేఏ పాల్ పాడిన పాట ట్విట్టర్ లో స్మైలీలతో పోస్ట్ చేశారు.