తెలుగు టీవీ రంగంలో బాగా పాపులర్ అయిన కామెడీ షో 'జబర్దస్థ్'. ఆ తర్వాత ఎక్స్ ట్రా జబర్ధస్త్ కూడా మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంతో హట్ యాంకర్లు అనసూయ, రష్మిలకు మంచి క్రేజ్ రావడమే కాదు వెండి తెరపై వరుసగా ఛాన్స్ లు కూడా వస్తున్నాయి. జబర్ధస్త్ కామెడీ తో పాపులర్ అయిన కమెడియన్లు ఇప్పుడు వెండితెరపై స్టార్ కమెడియన్ల స్థాయికి ఎదిగారు. జబర్ధస్త్ కామెడీ షో అంటే ఈ మద్య కాలంలో వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది.
తన స్కిట్ లోకామెడీనే కాదు పవర్ ఫుల్ పంచ్ డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అందుకే జబర్ధస్త్ కమెడియన్లలో బెస్ట్ కమెడియన్ గా పాపులర్ అయ్యారు. గత కొంత కాలంగా హైపర్ ఆది బిజీగా ఉన్నారు. ఒక వైపు 'జబర్దస్త్' చేస్తూనే మరో వైపున సినిమాలు కూడా చేస్తున్నాడు. పవన్ 'జనసేన' తరఫున ప్రచారాల్లో సైతం పాల్గొంటున్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక స్కిట్ విషయంలో హైపర్ ఆదికి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారనేది ఆ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ స్కిట్ విషయంపై బాలకృష్ణ ఫోన్ చేసి మరీ క్లాస్ తీసుకున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై తాజా ఇంటర్వ్యూలో హైపర్ ఆది స్పందించాడు.
తాను బాలకృష్ణను ఇబ్బంది పెట్టే ఏ స్కిట్ చేయలేదని..కాకపోతే ఆ మద్య అదిరే అభి స్కిట్ మద్యలో ఒకరు ఎన్టీఆర్ గెటప్ వేశారని..దానిపై కొంత మంది ఎన్టీఆర్ అభిమానులు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారని అదే విషయాన్ని ఎక్కడో ప్రస్తావిస్తే అది తననే బెదిరించారని వార్తలు వస్తున్నాయని క్రియేట్ చేశారని అన్నారు. వాస్తవానికి అవన్నీ ఒట్టి రూమర్లు నమ్మాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చాడు.