మహేష్ బాబు నమత్రలు వైవాహిక బంధంలోకి అడుగు పెట్టి నేటితో సరిగ్గా 14 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఆనందాన్ని తమ అభిమానులుతో పంచుకుంటూ మహేష్ మీడియా ద్వారా తన అర్దాంగికి విషస్ తెలియచేసాడు. నమ్రత తన జీవితంలోకి వచ్చిన తర్వాత మరింత సంతోషం తన లైఫ్ లోకి వచ్చినట్లయిందని చెపుతూ మహేష్ షాకింగ్ ట్విట్ చేసాడు. అంతేకాదు మహేష్ తన భార్య నమ్రతతో కలిసి తీయించుకున్న ఒక రొమాంటిక్ ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు.
మాజీ ఫెమీనా మిస్ ఇండియా నమ్రత శిరోద్కర్ మహేష్ తో 5 సంవత్సరాలు డేటింగ్ చేసి ఆతరువాత ఫిబ్రవరి 10 2005లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ వంశీ మూవీ ముహూర్తం టైంలో మొదటిసారి తాను మహేష్ ను కలిసినప్పుడు చాలా రిజర్వ్డ్ గా క్వైట్గా కూర్చోవడమే కాకుండా కనీసం తనకు హలో కూడా చెప్పక పోవడంతో అంత ఇగో ఉన్న హీరోతో అన్ని రోజులు కలిసి ఎలా షూటింగ్ చేయాలి అని మధన పడ్డ విషయాలను నమ్రత గుర్తుకు తెచ్చుకుంది.
అయితే ఇదే సినిమా కోసం తామిద్దరం న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు తానె చొరవతీసుకుని మాట్లాడినప్పుడు మహేష్ చాలా ఫన్ లవింగ్ పర్సన్ అని విపరీతమైన సెన్సాఫ్ హ్యూమర్ ఉందని తను మాట్లాడడం మొదలెడితే నవ్వు ఆపలేమనే విషయాలు తనకు తెలిశాయి అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకుంది. ఆ తరువాత తామిద్దరం కలిసి డిన్నర్ లకి సినిమాలు చూడ్డానికి వెళ్ళడమే కాకుండా ఆ తరువాత తాము ఇద్దరం ఒకరినొకరు ఒక్క క్షణం కూడ వదులుకోలేని పరిస్థితికి చేరుకున్న విషయాలను వివరించింది.
ఇక పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎలా వచ్చిందనే విషయం గురించి క్లారిటీ ఇస్తూ తమ ఇద్దిరి మధ్య ప్రేమ ఘాడంగా పెరిగి పోవడంతో విడిగా ఉండడం చాలకష్టం అన్న అభిప్రాయానికి వచ్చిన విషయాలను గుర్తుకు చేసుంటూ తాము ఇద్దరం కలిసి ఉండాలంటే పెళ్లి ఒకటే మార్గం అనుకుని పెళ్లి చేసుకున్న విషయాలను గుర్తుకు చేసుకుంది నమ్రత. మహేష్ సూపర్ స్టార్ గా ఎదగడంలో నమ్రత సహాయ సహకారాలు లేక పోయినా మహేష్ అనేక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎదగడంలో నమ్రత వ్యూహాలు ఎంతగానో మహేష్ కు సహకరించాయి అన్నది ఓపెన్ సీక్రెట్..