బోల్డ్ కంటెంట్ తో తీస్తున్న సినిమాలకు ఈమధ్య ప్రేక్షకుల నుంచి  ఆదరణ బాగా పెరుగుతోంది. దీనికితోడు ‘అర్జున్ రెడ్డి’ ఘన విజయం తరువాత ఈ ట్రెండ్ మరింత పెరిగిపోయింది. ఇలాంటి ట్రెండ్ ను నమ్ముకుని వస్తున్న మరో మూవీ 'ఫలక్ నుమా దాస్'.  
త్వరలో విడుదల
'ఈ నగరానికి ఏమైంది' సినిమాలో నటించిన విష్వక్ సేన్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించడమే కాకుండా దర్శకత్వం వహించి నిర్మించడం విశేషం.  ఈసినిమా టీజర్ రిలీజ్ ఫంక్షన్ నిన్న జరిగింది. అయితే ఈ ఈవెంట్ లాంచ్ సందర్భంగా జరిగిన మీడియా మీట్ లో మీడియా ప్రతినిధులు అడిగిన  ప్రశ్నలకు విష్వక్ సేన్ ఇచ్చిన అన్సర్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. 
రొమాంటిక్ సన్నివేశాలు
ఈ సినిమా టీజర్ హాట్ గా ఉంది కదా ? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘ఈ సినిమాను తీసింది నాలాంటోళ్ళ కోసం’ అని చెప్పి షాక్ ఇచ్చాడు. అయితే సినిమాకు సెన్సార్ అనేది ఒకటుంది కదా ? అనే మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ తాను చచ్చిపోయిన తర్వాత కూడా ఈసినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు అంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇదే సందర్భంలో ఈ హీరో మాట్లాడుతూ నిజాయితీగా ఉన్నవాడికి పొగరెక్కువ అని అంటూ హైదరాబాద్ లో ఉండేవారికి అందరికీ పొగరెక్కువ అని మరో ట్విస్ట్ ఇచ్చాడు. 
ఫలక్ నుమా దాస్ పోస్టర్ విడుదల
ఈమూవీ లో ఒక ప్రత్యేక పాత్ర చేసిన తరుణ్ భాస్కర్ గురించి మాట్లాడుతూ తరుణ్ ఈసినిమాలో ప్రతి సీన్ ఎలా నటించాలో చూపించాడు అని చెపుతూ తరుణ్ భాస్కర్ లేకుంటే ఈసినిమా లేదు అని అంటున్నాడు. సినిమా అవుట్ పుట్ బాగుంటే 'బాగా చేశాడు' అంటారు. లేకపోతే 'బలిసి చేశాడు రా’ అంటూ ప్రేక్షలు కామెంట్ చేస్తారు అని చెపుతూ తానూ అన్నింటికి రెడీగా ఉన్నాను అంటూ హీరో విష్వక్ సేన్ సిన కామెంట్స్ విన్న మీడియా వర్గాలు ఇతడిలో విజయ్ దేవరకొండ లక్షణాలు ఉన్నట్లు కామెంట్స్ చేసినట్లు టాక్. దీనితో ఈసినిమా కూడ మరో అర్జున్ రెడ్డ్డి అవుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: