పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి బాలీవుడ్ పై బాగానే ప్రభావం చూపిస్తుంది. ఇప్పటికే పాక్ నటులను నిషేదిస్తూ..ఆలిండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్కి చెందిన నటీనటులు, సింగర్స్ని పూర్తిగా నిషేధించాలని వారు చెప్పడంతో మేకర్స్ ఒక్కొక్కరుగా తమ చిత్రాల్లో పని చేస్తున్న పాక్ కళాకారులని తొలగించి కొత్త వారిని తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ తన నిర్మాణంలో రూపొందిస్తున్న ‘నోట్ బుక్’ చిత్రం నుండి ప్రముఖ సింగర్ అతీఫ్ అస్లామ్ని తొలగించాడట. అతీఫ్ పాక్ సింగర్..పుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్ తో ఈ సింగర్ ని తొలగించి ఆయన స్థానంలో అర్మాన్ మాలిక్ని తీసుకున్నట్టు తెలుస్తుంది.
ఇటీవల బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ తన చిత్రం ‘టోటల్ థమాల్’ను పాకిస్తాన్లో రిలీజ్ చేయడం లేదని ప్రకటించారు. సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్పై రూపొందుతున్న నోట్ బుక్ చిత్రంలో జహీర్ ఇక్బాల్, ప్రనూతన్ భాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 29న ఈ చిత్రం విడుదల కానుంది.