ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు వస్తున్నాయి. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఈ మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువ వస్తున్నాయని చెప్పొచ్చు. మహేష్ బాబు, పవన్ కళ్యాన్, రామ్, వరుణ్ తేజ్ లతో కలిసి వెంకటేష్ నటించారు. తాజాగా ఆయన మేనళ్లుడు అయిన నాగ చైతన్యతో కలిసి నటిస్తున్నారు.
ఈ చిత్రం పేరు ‘వెంకిమామ’. సర్థార్ గబ్బర్ సింగ్ ఫేమ్ బాబి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ మద్య ఎన్టీఆర్ తో జై లవకుశ చిత్రంతో మంచి విజయం అందుకున్న బాబీ మరోసారి మల్టీస్టారర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్ విషయంలో కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. ఇప్పటి వరకు రకుల్ ప్రీత్ సింగ్ అని, నాభా నటేష్ అని వార్తలొచ్చాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ‘వెంకిమామ’చిత్రంలో హీరోయిన్ గా రాశి ఖన్నా పేరు ఖరారైనట్లు తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బాబీతో కలిసి కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు.