భారత్ పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణం నెలకున్న రీత్యా ఏక్షణంలో అయినా మరోసారి ఉగ్రవాదులు రెచ్చి పోవడమే కాకుండా మన దేశానికి సంబంధించిన విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేస్తారు అని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనితో ప్రతి ఎయిర్ పోర్ట్ లోను విపరీతమైన సెక్యూరిటీ పెంచారు.
ఈ అనుకోని పరిణామం నిన్న మహేష్ నటిస్తున్న ‘మహర్షి’ సినిమాకు అవరోధంగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాల చిత్రీకరణ హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చిత్రీకరించడానికి ముందుగానే పర్మిషన్స్ తీసుకున్నారు.
ఈ షూటింగ్ లో పాల్గొనడానికి మహేష్ మేకప్ వేసుకుని నిన్న ఉదయం 7.30 లకు ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. అయితే అక్కడ మహేష్ ను ఎయిర్ పోర్ట్ అధికారులు అడ్డగించి ఢిల్లీలోని ఉన్నత అధికారుల పర్మిషన్ వచ్చేదాకా ‘మహర్షి’ షూటింగ్ ఆపు చేయమని కోరినట్లు సమాచారం.
అయితే తమకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని ‘మహర్షి’ యూనిట్ చెప్పినా ఎయిర్ పోర్ట్ అధికారులు పట్టించుకోలేదని సమాచారం. దీనితో మహేష్ ఎయిర్ పోర్ట్ వద్ద పార్క్ చేయబడ్డ తన వ్యాన్ లో సుమారు ఐదు గంటలు అధికారుల పర్మిషన్ గురించి ఎదురు చూసి చివరకు అనుమతులు లభించక పోవడంతో తిరిగి వెళ్ళి పోయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా పడుతున్న ‘మహర్షి’ షూటింగ్ కు ఇండియా పాకిస్తాన్ ల మధ్య సమస్యలు కూడ ‘మహర్షి’ కి శాపంగా మారడం యాధృశ్చికం అనుకోవాలి..