టాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ హీరోలకు డబ్బింగ్ చెబుతూ..నటుడిగా కొనసాగిన సాయి కుమార్ వారసుడు ఆది హీరోగా పరిచయం అయిన కొత్తలో వరుసగా మంచి విజయాలు అందుకున్నాడు. ఆ తర్వాత నటించిన సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో చాలా గ్యాప్ తీసుకొని ప్రస్తుతం ‘గోల్డ్ ఫిష్’మూవీలో నటిస్తున్నాడు. వినాయకుడు’, ‘కేరింత’ వంటి సెన్సిబుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన అడివి సాయికిరణ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయికుమార్..ఎన్.ఎస్.జి కమాండో అర్జున్ పండిట్ పాత్రలో నటిస్తుండా హీరోయిన్గా ‘ఎయిర్ టెల్’ మోడల్ శషా చెత్రి నటిస్తున్నారు.
కాశ్మీర్ తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా టీజర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. ఒకటిన్నర నిముషంకంటే తక్కువ నిడివి ఉన్న టీజర్లో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. ఘాజీబాబా అనే తీవ్రవాది ఇలా ఇండియా-పాకిస్తాన్ మధ్య నడిచే కథగా టీజర్ ని చూస్తే అర్ధమవుతోంది. "హూ ఈజ్ ది గోల్డ్ ఫిష్?"(గోల్డ్ ఫిష్ ఎవరు) అంటూ ఆది ఎవరినో వెతుకుతూ ఉంటాడు. 'కాశ్మీర్ పాకిస్తాన్ దే" అంటూ అందరూ తవ్రవాదులు చెప్పే డైలాగ్స్. ఒకవైపు అనిష్ కురువిల్లా "యూ కెనాట్ కిల్ ఘాజీ బాబా"(నువ్వు ఘాజీ బాబా ను చంపకూడదు) అంటూ ఉంటే.. ఆది మాత్రం ఆయనకోసం తీవ్రంగా గాలిస్తూ ఉంటాడు.. 'ఏక్ హిందుస్తాని కభీ వాదా నహీ తోడ్తా' అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా చెప్తాడు.
ఈ సినిమాలో మోడల్ శషా చెత్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్, మనోజ్ నందం, కృష్ణుడు, అనీశ్ కురువిల్లా, రావు రమేశ్ కీలక పాత్రధారులుగా నటించారు. ఈ ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.