తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మల్టీస్టారర్ చిత్రాలు బాగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ ఆయన మేనళ్లుడు అక్కినేని నాగ చైతన్య ఫుల్ లెన్త్ కామెడీ చిత్రంగా ‘వెంకిమామ’రూపొందుతుంది. జై లవకుశ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
వెంకీ, చైతూ కాంబినేషన్లో కొన్ని సరదా సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే చైతూ సరసన రాశీఖన్నా, వెంకి సరసన పాయల్ రాజ్ పూత్ నటిస్తున్నారు. ఇప్పటికే రాశీఖన్నా షూటింగ్ లో పాల్గొనగా..తాజాగా పాయల్ రాజ్ పుత్ జాయిన్ అయింది. తాజాగా దీనికి సంబంధించిన విషయాన్ని ట్విట్టర్ లో పేర్కొంది. 'వెంకీమామ' షూటింగులో పాల్గొన్నాను .. చాలా ఎగ్జైటింగ్ గా వుంది' అని ఆమె పేర్కొంది.
కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాపై దర్శకుడు బాబీ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 'ఎఫ్ 2' తరువాత వెంకటేశ్ నుంచి వస్తోన్న మరో వినోదభరిత చిత్రం కావడంతో, అభిమానుల్లోను అంచనాలు వున్నాయి. ఈసారి మామా అల్లుడు ఏ రేంజ్ లో హిట్ అందుకుంటారో వేచి చూడాలి.