రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ జీవిత అసలు కథగా వస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ పీక్స్ లో చేస్తున్నారు. మార్చి 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఏ విధంగా అడ్డుకోవాలా అని ఆలోచనలో ఉన్నారు టిడిపి శ్రేణులు. ఈసీకి ఫిర్యాదు చేసినా లాభం లేకుండాపోయింది.


మరోపక్క వర్మ ఈ సినిమా ప్రమోషన్స్ ను ఇంకాస్త భారీగా చేస్తున్నాడు. ఈమధ్యనే ఓ ఈవెంట్ పెట్టి రెండో ట్రైలర్ రిలీజ్ చేశాడు. దానికి సిం హ గర్జన అని టైటిల్ పెట్టాడు. ఇప్పుడు మరో ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారట. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ఆడియో రిలీజ్ ఈవెంట్ గా ఇది జరుగుతుందట. కడపలో ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు ఆర్జివి.


అయితే ఈ ఈవెంట్ కు పేరుగా వెన్నుపోటు అలియాస్ ఎన్.టి.ఆర్ నైట్ అని పెడుతున్నాడట. అసలే రాజకీయాలతో ఏపి మొత్తం హాట్ హాట్ గా ఉంటే ఇప్పుడు వర్మ వెళ్లి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా ప్రమోట్ చేయాలని చూస్తున్నాడు. వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా రిలీజ్ ముందు హంగామా బాగుంది మరి ఆఫ్టర్ రిలీజ్ పరిస్థితి ఏంటన్నది చూడాలి.


ఆర్జివి మాత్రం ముందునుండి చెబుతున్నట్టుగా అసలు సిసలు ఎన్.టి.ఆర్ కథ ఇదే అంటూ చెబుతున్నాడు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ అన్ని సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి వాటికి తగినట్టుగానే సినిమా ఉంటుందా లేదా అన్నది మాత్రం ఈ శుక్రవారం తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: