తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాల్లో తల్లిగా, బామ్మగా నటించిన నటి వడివుక్కరసి గుర్తుందా..అప్పట్లో రజినీకాంత్ నలించిన అరుణాచలంలో బామ్మగా శివాజీ చిత్రాల్లో తల్లిగా నటించింది. తాజాగా వడివుక్కరసి ఇంట్లో దొంగతనం జరిగింది. ఈమె ప్రస్తుతం టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు.
చెన్నై, టీ-నగర్ పరిధిలోని పాండీ బజార్ పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, రామన్ వీధిలో నివాసం ఉంటున్న వడివుక్కరసి, పది రోజుల క్రితం అదే వీధిలో ఉన్న తన కుమార్తె ఇంటికి వెళ్లారు.బుధవారం ఇంటికి తిరిగిరాగా తలుపులు తెరచిఉన్నాయి.
ఇంటిలోపలికి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి 8 సవర్ల నగలను దుండగులు చోరీ చేసినట్టు తెలిసింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.2లక్షలు. వెంటనే ఆమె టీ.నగర్లోని పాండిబజార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.