తెలుగు ఇండస్ట్రీలోకి ‘అష్టాచమ్మా’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తర్వాత వచ్చిన చిత్రాలతో పెద్దగా విజయాలు అందుకోలేక పోయాడు.  అప్పుడప్పుడు ఒక్కటీ రెండు చిత్రాలు మాత్రమే గుర్తింపు తెచ్చాయి. మారుతి దర్శకత్వంలో ‘భలే భలే మగాడివోయ్’చిత్రంతో ఒక్కసారే పాపులర్ అయ్యాడు.  ఈ చిత్రం తర్వాత వరుసగా ఆరు చిత్రాలు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.   

ప్రస్తుతం  'జెర్సీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని.  ఈ చిత్రం తర్వాత మనం ఫేమ్ కె. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించబోతున్నాడు.  అయితే ఈ చిత్రంతో పాటే  ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నాని సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు.  ఈ చిత్రానికి ‘వ్యూహం’అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ చిత్రంలో సుధీర్ బాబు కూడా ఉండటం వలన, ఇది మల్టీ స్టారర్ మూవీ అంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో నాని కొద్దిసేపే కనిపిస్తాడని టాక్ వినిపిస్తుంది. 

గతంలో అల్లు అర్జున్, రాంచరణ్ నటించిన ‘ఎవడు’చిత్రంలో అల్లు అర్జున్ లా కొద్ది నిడివిలోనే ఉండబోతున్నాడని ఫిలిమ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.  దాంతో ఇది మల్టీస్టారర్ మూవీ కదని తెలుస్తుంది.   అంతే కాదు దిల్ రాజుతో పాటు నాని కూడా ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నాడనే ఒక  టాక్ కూడా వినిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: