తెలుగు ఇండస్ట్రీలో మాస్ మహరాజుగా పేరు తెచ్చుకున్న రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రం తర్వాత వరుసగా అపజయాలు పొందుతునక్నాడు.  దాదాపు మూడు సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవితేజ.. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.  ఈ చిత్రం తర్వాత వచ్చిన నాలుగు చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆయన కథల విషయంలో మరింత శ్రద్ధ పెట్టాడు.

అంతకుముందు ఓకే చేద్దామనుకున్న ప్రాజెక్టులను కూడా రద్దు చేసుకున్నాడు.  హిట్ తెచ్చిపెడుతుందనే పూర్తి నమ్మకం కలిగిన కథలకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అంతే కాదు రెమ్యూనరేష్ విషయంలో కూడా కాస్త పట్టు బిగించారు. ప్రస్తుతం  'డిస్కో రాజా' చిత్రం మాత్రమే చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగు దశలో వుంది.

అయితే ఎండలు విపరీతంగా ఉండటంతో, కొన్ని రోజులు బ్రేక్ తీసుకున్న రవితేజ, ఫ్యామిలీతో విదేశాలకి బయలుదేరుతున్నాడు.  సమ్మర్ టూర్  నుంచి వచ్చాకనే మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టనున్నాడని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: