టాలీవుడ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో అంటూ కడుపుబ్బా నవ్వించే కమెడియన్ ఫృథ్వి ఈ మద్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నారు.   కెరీర్ బిగినింగ్ లో విలన్ పాత్రల్లో కనిపించి ఫృథ్వి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కొంత కాలం నుంచి తనదైన పేరడీ డైలాగ్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.  ఒకదశలో బ్రహ్మానందం లాంటి సీనియర్ నటులతో పోటీ పడీ మరి నటించారు ఫృథ్వి . ఈ మద్య వైసీపీ పార్టీలో చేరిన ఆయన పలువురు నేతలపై తనదైన కామెడీ సెటైర్లు వేసి హంగామా చేశారు. 

తాజాగా టాలీవుడ్ లో కొంత మంది కుట్ర చేసి తనకు బెస్ట్ కమెడియన్ అవార్డు రాకుండా ఆపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫృథ్వి  మాట్లాడుతూ..హీరో గోపీచంద్ నటించిన ‘లౌక్యం’ సినిమాకు తనకు బెస్ట్ కమెడియన్ అవార్డు రావాల్సిందని ఈ విషయాన్ని చాలామంది తనకు చెప్పారని వ్యాఖ్యానించారు. కానీ చివరి నిమిషంలో తన పేరును అవార్డుల జాబితా నుంచి తప్పించేశారని ఆవేదన వ్యక్తం చేశారు.  తాను ఓ పార్టీ జెండా పట్టుకుంటే నాకు నిజంగా బెస్ట్ కమెడియన్ అవార్డు వచ్చి ఉండేది..కానీ అలా చేయనందుకు నాకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. 

సరే ఆ అవార్డు నాకు రాలేదని నేను బాధపడను..కానీ టాలీవుడ్ లో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ అవార్డుకు అన్నివిధాల అర్హుడైన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో కలిసి చాలా సినిమాల్లో కైకాల పనిచేశారని గుర్తుచేశారు.  ఆ అవార్డు  కమల్ హాసన్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  నేను కైకాలను డాడీ అని  పిలుస్తా.. ఇదేంటి డాడీ అని అడిగితే.. ఇవన్నీ నాకు నచ్చవు. నేను భజన చేసేవాడిని కాదు  అని చెప్పారని గుర్తుచేసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: