తెలుగు ఇండస్ట్రీలో 90వ దశకంలో ఎన్నో విభిన్న పాత్రల్లో నటించి మెప్పించిన నటుడు మురళీ మోహన్ తర్వాత బుల్లితెరపై కూడా ఎంట్రీ ఇచ్చాడు.  ఇక రాజకీయాల వైపు అడుగులు వేసిన మురళీ మోహన్ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు.   రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ బాధ్యతలు నిర్వహించారు. 

తాజాగా ఆయన తల్లి  శ్రీమతి మాగంటి వసుమతిదేవి కన్నుమూశారు. గురువారం ఉదయం ఆమె తమ స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. వసుమతిదేవి వయస్సు ప్రస్తుతం 100 సంవత్సరాలు.  ఆమె  అంత్యక్రియలు శుక్రవారం ఉదయం జేఎన్ రోడ్ లో నిర్వహించనున్నారు.

మాతృవియోగంతో బాధపడుతున్న మురళీమోహన్ ను పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించారు. కాగా, కృష్ణాజిల్లా గుడివాడలోని గౌరీసంకరపురం గ్రామంలో  శతవసంతోత్సవ వేడుకలు నిర్వహించారు.  వందో పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కేక్ కట్ చేయించారు మురళీమోహన్.  


మరింత సమాచారం తెలుసుకోండి: