సన్రైజర్స్ హైదరాబాద్-కోల్కతానైట్రైడర్స్ మధ్య ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో నిన్న జరిగిన మ్యాచ్ సందర్భంగా కొంతమంది యువతీయువకులు మద్యం మత్తులో హల్చల్ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మద్యం మత్తులో ఆరుగురు యువతీ,యువకులు స్టేడియంలో వీరంగం సృష్టించారు.
వీరిలో తెలుగు టీవీ యాక్టర్ ప్రశాంతి కూడా ఉన్నారు. మ్యాచ్ చూసేందుకు వచ్చిన యువతీ,యువకులు మ్యాచ్ జరుగుతుండగా మద్యం తాగి హంగామా సృష్టించారు.అక్కడే ఉన్నవారిపై అసభ్యకరంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు దిగారు.అక్కడే ఉన్న భరత్ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ ఉపాధ్యాయ(41)ను మ్యాచ్ చూడనీయకుండా అడ్డుకున్నారు.
దీంతో సంతోష్ ఉప్పల్ పోలీసులకు కంప్లెయింట్ చేశారు.తనను అసభ్యపదజాలంతో తిట్టారని,భయపెట్టారని కంప్లెయింట్ లో తెలిపాడు.ఆరుగురిపైన కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.