టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ మద్య పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో మునిగిపోయింది. సాధారణంగా తన సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మహేష్ బాబు కుటుంబ సభ్యులతో విదేశాలకు వెకేషన్ టూర్ కి వెళ్లడం సర్వసాధారణం. తన సినిమా హిట్ అయినా..ఫ్లాప్ అయినా వాటి తో సంబంధం లేకుండా భార్య పిల్లలతో విదేశాలకు వెళ్తుంటారు.
తాజాగా ‘మహర్షి’ చిత్రీకరణతో ఫుల్ బిజీగా ఉన్న సూపర్స్టార్ మహేశ్బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి విహారయాత్ర నిమిత్తం పారిస్కు వెళ్లారు. గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’ తో సూపర్ హిట్ అందుకున్నారు మహేష్ బాబు. ‘మహర్షి’ చిత్రీకరణతో ఫుల్ బిజీగా ఉన్న సూపర్స్టార్ మహేశ్బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో సమ్మర్ హాలీడేస్ పారీస్ లో గడిపేందుకు వెళ్లారు.
అక్కడ తీసుకున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పారిస్కు బయలుదేరుతున్నామంటూ నమ్రత కొన్ని గంటల క్రితం ఇన్స్టాగ్రామ్లో మహేశ్తో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. తమ కుటుంబంతో తీసుకునే ఫోలో..లొకేషన్స్ మహేష్ సతీమని నటి నమ్రత సోషల్ మాద్యమాల్లో అప్ లోడ్ చేస్తుంది.
‘పారిస్కు వెళుతున్నాం.... అందరికీ ఈస్టర్ పర్వదిన శుభాకాంక్షలు’ అని క్యాప్షన్ ఇచ్చారు. విహారయాత్ర ముగించుకున్న అనంతరం మహేశ్ ‘మహర్షి’ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.