ఈ మద్య కొత్త హీరో, హీరోయిన్లు ఇంట్రడక్షన్ బాగానే జరుగుతుంది. కంటెంట్ బాగుంటే కొత్త పాత అనే తేడా లేకుండా ఎలాంటి చిత్రాలైనా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. తాజాగా సుధాకర్, నిత్య నాయకా జంటగా హరినాథ్ బాబు దర్శకత్వంలో ‘నువ్వు తోపురా’ చిత్రం రూపొందింది. ఈ చిత్రంతో హీరో, హీరోయిన్లు వెండి తెరకు కొత్తగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా చేయించారు.
ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ తెలుగు ఇండస్ట్రీలో కొత్త హీరో, హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని..నటన పరంగా కష్టపడి పైకి వచ్చేవారిని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని అన్నారు. ఒక తెలంగాణ కుర్రాడి జర్నీగా .. మాస్ అంశాలతో ఈ సినిమా నిర్మితమైందనే విషయం ఈ ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్, యూత్ ను ఆకట్టుకునేలా వుందన్నారు. సీనియర్ హీరోయిన్ నిరోషా కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాను, మే 3వ తేదీన విడుదల చేయనున్నారు.