స్టార్ డైరెక్టర్ వంశి పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా వస్తున్న ‘మహర్షి’సినిమా అప్పుడే అంచనాలు పెంచేస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. మే 1న నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో సాయంత్రం 6 గంటలకు ప్రీ రిలీజ్ వేడుక అట్టహాసంగా జరగబోతోంది. ఇప్పటికే టాలీవుడ్ టాప్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లను సంప్రదించినట్లు సమాచారం.
ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మరో ప్రత్యేకం ...మహేశ్ ఇప్పటి వరకు నటించిన 24 సినిమాల దర్శకులంతా హాజరుకాబోతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబుకి ‘మహర్షి’25వ మూవీ. దాంతో సినిమాకు సంబంధించిన ప్రతి అంశం ప్రత్యేకంగా ఉండాలని చిత్రబృందం భావించిందట. 1999లో ‘రాజకుమారుడు’ మూవీతో మహేశ్ సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు.
ఆ సినిమాకు దర్శకత్వం వహించిన కే.రాఘవేంద్రరావు నుంచి 2019లో విడుదల కాబోతున్న ‘మహర్షి’ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి వరకు మహేశ్తో కలిసి పనిచేసిన అందరు దర్శకులు ఒకే వేదికపై కనువిందుచేయబోతున్నారని సమాచారం. ఈ సినిమాలో అల్లరి నరేశ్ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.