భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్న శ్రీదేవి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ ని వివాహం చేసుకున్న తర్వాత సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఆమె కూతుళ్లు జాన్వి, ఖుషీ కపూర్ లను పెంచింది.  అయితే తన తర్వాత తన వారసురాలిగా జాన్వి, ఖుషీ కపూర్ లను హీరోయిన్లుగా చూడాలనుకున్న శ్రీదేవికి ఆ ఆశనెరవేరకుండానే గత ఏడాది దుబాయ్ లో ఓ హోటల్లో ప్రమాద వశాత్తు చనిపోయింది.  ఆమె చనిపోయిన కొన్ని నెల తర్వాత శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ నటించిన ‘ధడక్’సినిమా రిలీజ్ అయి మంచి హిట్ సాధించింది. 

ప్రస్తుతం ఈ జాన్వి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తోంది. అలానే 'తక్త్' అనే మరో బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అప్పుడప్పుడు హాట్ హాట్ గా  ఫోటోషూట్స్ తో కుర్రాళ్లను పిచ్చెక్కిస్తూ ఉంటుంది.  దాంతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.  ఎంత గొప్ప హీరోయిన్ అయినా..తనకంటూ కొన్ని అభిరుచులు ఉంటాయి..వారెవరో తాజాగా ఓ టీవీ షోలో వెల్లడించింది.

నేహా ధూపియా హోస్ట్ చేస్తోన్న 'బీఎఫ్ విత్ వోగ్' షోలో జాన్వీ పాల్గొంది. ఈ సందర్భంగా జాన్వీ..నీకు తొలిముద్దు పెట్టుకునే అవకాశం వస్తే విక్కీ కౌశల్ , కార్తిక ఆర్యన్ లలో ఎవరిని ఎంపిక చేసుకుంటావని..? జాన్వీని ప్రశ్నించగా.. ''విక్కీ కౌశల్'' పేరు చెప్పింది. దాంతో నేహా ధూపియా  షాక్ తిన్నారు..విక్కీ కౌశల్ పెద్ద స్టార్ కాదు..ఇప్పుడిప్పుడే బాలీవుడ్ తో తనకంటూ పేరు తెచ్చుకుంటున్నాడు. ఈ హీరోతో తొలిముద్దు కోసం వెయిట్ చేస్తోంది జాన్వీ. 


మరింత సమాచారం తెలుసుకోండి: