‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ అయి కౌంట్ డౌన్ మొదలు అవ్వడంతో ఆరోజు విడుదల కాబోయే ఈసినిమా ట్రైలర్ గురించి మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈమూవీ పాటలు పెద్దగా కనెక్ట్ కాని పరిస్థుతులలో ఈమూవీ ట్రైలర్ ద్వారా హైక్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ ట్రైలర్ కట్ విషయంలో దిల్ రాజ్ వంశీ పైడిపల్లిల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఈ ట్రైల‌ర్ లో చూపించవలసిన షాట్స్ ఏమిటి ? అనే విషయమై వీరిద్దరి మధ్య చర్చలు జరుగుతూ ఒకరి అభిప్రాయాలతో మరొకరి అభిప్రాయాలు క్లాష్ అవుతున్నట్లు టాక్. 

దీనితో దిల్ రాజ్ స్వయంగా రంగంలోకి దిగి వంశీ పైడిపల్లి చేత రెండు రకాల ట్రైలర్స్ ను కట్ చేయించి రెడీ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విదేశాలలో ఉన్న మహేష్ ఈనెల 30న తరిగి వస్తున్న పరిస్థుతులలో అతడికి చూపించి ఈ ట్రైలర్ విషయమై ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఈమూవీ నిడివి 170 నిమషాలకు ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ నిడివి మూడున్నర గంటల వరకు వచ్చిన నేపధ్యంలో మూడు గంటల లోపు ఈసినిమాను ఎడిట్ చేయడానికి చాల కష్టపడినట్లు టాక్.  ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 1న ముగిసిన వెంటనే ఈమూవీని ప్రమోట్ చేస్తూ అనేక న్యూస్ ఛానల్స్ కు అదేవిధంగా ప్రింట్ మీడియాకు రకరకాల ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వడానికి మహేష్ సిద్ధం అవుతున్న నేపధ్యంలో నమ్రత పిఆర్ టీమ్ ఈ విషయమై భారీ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: