రాబోయే నెల మే 1న జరిగే ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అత్యంత భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమూవీ మహేష్ ఫిలిం కెరియర్ లో 25వ సినిమా కాబట్టి ఈ ఈవెంట్ ను చాల డిఫరెంట్ గా రూపొందించి ఈమూవీ పై హైక్ క్రియేట్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈ ఈవెంట్ లో ఒక అరుదైన దృశ్యం కూడ ఉండబోతున్నట్లు టాక్. మహేష్ తన కెరియర్ ను రాఘవేంద్రరావుతో మొదలుపెట్టి ప్రస్తుతం వంశీ పైడిపల్లి వరకు కొనసాగించిన నేపధ్యంలో మహేష్ తో సినిమాలు చేసిన ఆ 25 మంది దర్శకులను ఈ ఈవెంట్ కు పిలిచి సత్కరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ తో సినిమాలు చేసిన ఆ 25 మంది దర్శకులలో ‘బాబి’ మూవీని తీసిన దర్శకుడు శోభన్ తప్ప అందరూ ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నారు. దర్శకుడు శోభన్ కొంతకాలం క్రితం చనిపోయిన విషయం తెలిసిందే. దీనితో మహేష్ తో సినిమాలు తీసిన ఆ దర్శకులు అందరికీ ఇప్పటికే ఆహ్వానాలు వెళ్ళినట్లు టాక్. 

అయితే దర్శకుడు సుకుమార్ తో మహేష్ కు భేదాభిప్రాయాలు ఏర్పడి ఆసినిమాను క్యాన్సిల్ చేసుకున్న నేపధ్యంలో సుకుమార్ ఈ ఈవెంట్ కు వస్తాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే ప్రస్తుతం మహేష్ కు కొనసాగుతున్న సూపర్ స్టార్ ఇమేజ్ తో అందరి దర్శకులు రావడం ఖాయం అని అంటున్నారు. అదే జరిగితే 24 మంది దర్శకుల మధ్య మహేష్ నిలబడి మీడియా కెమెరాలకు పోజు ఇచ్చే దృశ్యం ఈ ఈవెంట్ కు హైలెట్ గా మారబోతోంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: