టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ సంచలన మూవీ ‘అర్జున్ రెడ్డి’ ని ‘కబీర్ సింగ్’ గా బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సందర్భంలో ఈమూవీ బాలీవుడ్ ఒక సంచలనం సృష్టిస్తుంది అన్న అంచనాలు ఇప్పటి నుంచే మొదలైపోయాయి. దీనికితోడు ఈమూవీలో హీరోగా నటిస్తున్న షాహిద్ కపూర్ ఈమూవీ గురించి తానుపడ్డ కష్టాన్ని వివరిస్తూ ఇప్పటి నుంచే ఈమూవీ పై అంచనాలను పెంచేస్తున్నాడు.

జూన్ 21న విడుదల కాబోతున్న ఈమూవీ ట్రైలర్ ను మే రెండవ వారంలో విడుదల చేయబోతున్నారు. ఈమూవీకి సంబంధించిన కథలో ఏమాత్రం మార్పులు చేయకుండా కేవలం ప్రాంతీయ నేపధ్యం మార్చి కథను ముంబాయ్ ఢిల్లీల మధ్య జరిగినట్లుగా ఉత్తారాది ప్రేక్షకుల దృష్టిలో ఉంచుకుని ఈకథలో చిన్న మార్పులు చేసారు. 

ఈమధ్యనే జరిగిన ‘జియో స్పా గ్లోబల్ స్పా ఇండియా అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్ కపూర్ తన కబీర్ సింగ్ మూవీ గురించి మాట్లాడుతూ మధ్యలో ప్రభాస్ ప్రస్తావన ఓపెన్ గా తీసుకు వచ్చి ఆ ఫంక్షన్ కు వచ్చిన అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రభాస్ తో తాను ఈమధ్య తన ‘కబీర్ సింగ్’ సినిమా గురించి మాట్లాడిన విషయం నిజమని చెపుతూ ప్రభాస్ మనసు వెన్న లాంటిది అలాంటి మృదు స్వభావిని తాను ఇప్పటి వరకు ఫిలిం ఇండస్ట్రీలో చూడలేదు అంటూ ప్రభాస్ పై ప్రశంసలు కురిపించాడు. 

అంతేకాదు ‘కబీర్ సింగ్’ మూవీలోని తన లుక్ ను చూసి ప్రభాస్ తనకు ఫోన్ చేసి 7 నిముషాల పాటు తన పై ప్రశంసలు కురిపిస్తూ మాట్లాడిన విషయాలు నిజమే అంటూ క్లారిటీ కూడ ఇచ్చాడు. దీనితో ప్రభాస్ ‘కబీర్ సింగ్’ సినిమాకు పరోక్షంగా ప్రమోట్ చేస్తూ బాలీవుడ్ ప్రేక్షకులు తనను మర్చిపోకుండా వ్యూహాలు రచిస్తూ త్వరలో విడుదల కాబోతున్న ‘సాహో’ సినిమాను బాలీవుడ్ ప్రేక్షకులకు గుర్తు చేయడానికి షాహిద్ కపూర్ తెలివిగా వాడుకుంటున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా ప్రభాస్ పై కామెంట్స్ చేస్తోంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: