బాలీవుడ్ హీరో అజయ్దేవగన్ సహధర్మచారిణి, బాలీవుడ్ మాజీ హీరోయిన్ కాజోల్కు తీరని అవమానం జరిగింది. ఆమెను అవమానించింది మరెవరో కాదు. యష్చోప్రా భార్య..! సెప్టెంబర్ 27న యష్చోప్రా బర్త్డే సెలబ్రేషన్స్కు ఆయన భార్య పమేలా చోప్రా ఎందరో హీరోయిన్లను ఇన్వైట్ చేసింది. కాని కాజోల్ని మాత్రం పార్టీకి పిలవకుండా అవమానించింది. గ్లామర్ హీరోయిన్గా బాలీవుడ్ తెరపై కాజోల్ తనదైన ముద్ర వేసింది. ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్కు 11 సార్లు నామినేటయ్యి, 6 సార్లు ఉత్తమనటి అవార్డును గెలుచుకుంది. అంతేకాదు, భారత ప్రభుత్వం 2011లో కాజోల్కు పద్మశ్రీ అవార్డుని కూడ ప్రదానం చేసింది. ఐతే ఇంతటి మేటి నటికి అవమానం జరిగింది.
కాజోల్కు యష్రాజ్ సంస్థతో బలమైన అనబంధం ఉంది. ఐటే, గత ఏడాది మరణించిన యష్చోప్రా జంతిని పురష్కరించుకొని యష్ రాజ్ ఫిల్మ్ సంస్థ వేడుకలు నిర్వహిస్తుంది. యష్చోప్ర సతీమణి పమేలాచోప్రా పర్యవేక్షణలో జరిగే ఈ వేడుకలకు శ్రీదేవి,మాధురిదీక్షిత్,జూహిచావ్లా,రాణిముఖర్జీ,ప్రీతిజింటా,కత్రినాకైఫ్ ఇలా యష్రాజ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థతో కలిసి పనిచేసిన హీరోయిన్లందరికి పమేలాచోప్రా ఆహ్యానాలు పంపింది. కానీ, తమ బ్యానర్లో దిల్వాలే దుల్హనియా లేజాయేందే, ఫనా వంటి బ్లాక్ బస్టర్స్ హిట్స్తో నటించిన కాజోల్ను మాత్రం ఈ వేడుకలకు దూరంగా పెట్టింది. యష్రాజ్ ముద్దుగుమ్మగా బాలీవుడ్లో కాజోల్ పేరు తెచ్చుకున్నప్పటికీ ఆమెను జయంతి వేడుకులకు పమేలాచోప్రా ఆహ్వానించకపోవడం బాలీవుడ్లో పెద్ద దుమారం రేపుతుంది. ఐతే, కాజోల్ భర్త అజయ్దేవగన్పై ఉన్న అసంతృప్తి కారణంగానే పమేలా ఇలా కక్ష సాధింపు చర్యలకు దిగిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయ్.