శ్రీదేవి నట వారసురాలుగా బాలీవుడ్ ఫిలిం ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తన మొదటి సినిమాతో చాల మంచి పేరు తెచ్చుకున్నా ఆసినిమాకు కమర్షియల్ గా కలక్షన్స్ సునామీ రాలేదు. దీనితో కొంత వరకు షాక్ అయిన జాన్వీ తాను నటిస్తున్న రెండవ సినిమా కలక్షన్స్ పరంగా సంచలనాలు సృష్టిస్తుంది అన్న ఊహలలో ఉంది.

ప్రస్తుతం ఈమె కరణ్ జోహార్ దర్మ ప్రొడక్షన్స్ లో 'కార్గిల్ గర్ల్' అనే మూవీలో నటిస్తోంది. ఈమూవీ  ఇండియన్ తొలి ఎయిర్ ఫోర్స్ ఉమెన్ ఫైలట్ గుంజన్ సక్సేనా రియల్ స్టోరీ ఆధారంగా తీయబడుతున్న బయోపిక్. ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ బాగా నడుస్తున్న నేపధ్యంలో ఈమూవీ బాగా కలిసి వస్తుందని జాన్వీ అభిప్రాయ పడుతోంది.  

అయితే ఈమూవీ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన గుంజన్ సక్సేనా బయోపిక్ కావడంతో ఈ చిత్రానికి దేశ రక్షణ శాఖ నుండి అనుమతి రావాల్సి ఉంది. ఈమూవీ స్క్రిప్ట్ కు రక్షణ శాఖ అనుమతి వచ్చిన తరువాత షూటింగ్ మొదలు పెట్టవలసి ఉన్నా రక్షణ్ శాఖ తమకు ఖచ్చితంగా అనుమతులు ఇస్తుంది అన్న నమ్మకంతో కరణ్ జోహార్ ఈమూవీ షూటింగ్ ను చాల వేగంగా పూర్తి చేస్తున్నాడు. 

అయితే కరణ్ జోహార్ అనుకున్న వేగంతో రక్షణ శాఖ నుండి అనుమతులు ఇప్పటికీ రాక పోవడం ఈమూవీ నిర్మాతలను టెన్షన్ లో పెడుతున్నట్లు టాక్. కార్గిల్ యుద్దంలో క్రియాశీలక పాత్ర పోషించిన గుంజన్ సక్సేనా అప్పట్లో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న మహిళా. శరణ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ తండ్రి పాత్రలో పంకజ్ త్రిపాఠి నటిస్తున్నాడు. ఈమూవీలో కూడ జాన్వీ నట విశ్వరూపం కనిపిస్తుంది అన్న ప్రచారం జరుగుతోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: