టాలీవుడ్ రాకింగ్స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అంటే ఒకప్పుడు తెలుగు జనాలు చెవి కోసుకునేవారు. ఇప్పుడు దేవి ఆల్బమ్ అంటే కనీసం ఒక్కసారి వినేందుకు అయినా ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. దేవిలో మునుపటి సత్తా లేదా ? లేక సరిగా కాన్సంట్రేషన్ చేయడం లేదా ? అన్న చర్చలు కూడా ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. స్టార్ హీరోలు, భారీ కాస్టింగ్తో తెరకెక్కే భారీ బడ్జెట్ సినిమాల ఆల్బమ్ విషయంలోనూ దేవి దృష్టి పెడుతున్నట్టు లేదు.
గత కొద్ది రోజులుగా దేవికి సరైన హిట్ ఆల్బమ్ లేదు. తాజాగా మహేష్ బాబు మహర్షి పాటలు ఒక్కొక్కటే రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన నాలుగు పాటల్లో ఒక్క పదరా.. పదరా పాట మినహా మిగిలిన పాటలు మహేష్ వీరాభిమానులకే నచ్చని పరిస్థితి. అసలు ఇది దేవి ఇచ్చిన పాటలేనా ? అన్న సందేహాలు కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన మూడు దేవి రేంజ్ పాటలు కావంటున్నారు.
ఇక గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చివరి సినిమా భరత్ అనే నేను ఆల్బమ్ సూపర్ హిట్ అయ్యింది. ఆ ఆల్బమ్లో మూడు పాటలు ఇప్పటకీ ప్రేక్షకుల నోళ్లలో నానుతూనే ఉన్నాయి. ఇక శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ హిట్లో దేవి ఆల్బమ్ క్రెడిట్ చాలా ఉంది. 1 నేనొక్కడినే డిజాస్టర్ అయినా ఆల్బమ్ మాత్రం బ్లాక్బస్టర్. ఇలా మహేష్ దేవికి ఛాన్స్ ఇచ్చినప్పుడల్లా ఆల్బమ్తోనే సినిమాను సగం హిట్ చేస్తోన్న దేవి ఈ సారి మహర్షికి మాత్రం చాలా వీకెస్ట్ ఆల్బమ్ ఇచ్చాడని దేవీపై మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
పాటలతోనే సినిమాపై సగం అంచనాలు దేవీ చంపేశాడని కూడా వారు ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఈ సంక్రాంతికి వచ్చిన రామ్చరణ్ వినయ విధేయ రామ సినిమాకు సైతం దేవీ ఆల్బమ్ ఇచ్చాడని అప్పుడు చరణ్ ఫ్యాన్స్ దేవీపై ఫైర్ అయ్యారు. ఇక ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ ఆగ్రహానికి సైతం దేవీ గురవుతున్నాడు. ఇక ఇప్పుడు మహర్షి మీద హైప్ క్రియెట్ అవ్వాలంటే ట్రైలర్ ఒక్కటే కనిపిస్తోంది.