తెలుగు టెలివిజన్ రంగంలో కామెడీకి పెద్ద పీట వేసిన ప్రోగ్రామ్ జబర్థస్త్. గత ఆరేళ్ల క్రితం ఈ ప్రోగ్రామ్ మొదలైంది. ఎంతో మంది చిన్న కళాకారులకు గుర్తింపు తెచ్చిన జబర్ధస్త్ కామెడీ షో అతి తక్కువ కాలంలోనే మంచి పాపులారటీ సంపాదించింది. తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ జబర్ధస్త్ కామెడీ షో బాగా నచ్చే ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అయితే జబర్ధస్త్ కామెడీ షో మొదలైనప్పటి నుంచి ఎంతో మంది కళాకారులు తమ స్కిట్స్ తో మెప్పించారు..అయితే ఆ స్కిట్ చూసి జడ్జిమెంట్ ఇచ్చే స్థానంలో మెగా బ్రదర్ నాగబాబు, నటి రోజా వ్యవహరిస్తున్నారు.
అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో తప్ప కంటిన్యూగా వీరిద్దరే జడ్జి స్థానంలో ఉండేవారు. అయితే జబర్ధస్త్ కామెడీ షో గత నాలుగు వారాల నుంచి నాగబాబు, రోజా దూరంగా ఉంటూ వస్తున్నారు. అందుకు కారణం ఏపిలో ఎన్నికలు. ఎన్నికల నేపత్యంలో వైసీపీ నుంచి రోజా, జనసేన నుంచి నాగబాబు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిరువురు ప్రచారం చేయడంలో బిజీగా ఉండటం చేత జబర్ధస్త్ కామెడీ షో దూరంగా ఉండాల్సి వచ్చింది. దాంతో వీరి స్థానంలో నటి మీనా, జానీ, శేఖర్ మాస్టర్లు వచ్చారు.
అయితే ఈ మద్య నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..తాను జబర్ధస్త్ ని ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని అన్నారు. ఎన్నికల రిజల్ట్ వచ్చి తాను ఎంపిగా కొనసాగుతున్నా..రెండు రోజుల వరకు తన ప్రోగ్రామ్ సర్దుకోగలనని అన్నారు. అయితే జబర్ధస్త్ కామెడీ షో రోజా నిష్క్రమిస్తుందని అనుకున్నారు చాలా మంది. కానీ 'జబర్దస్త్'కి రోజా తిరిగొచ్చేసింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో రోజా కనిపించింది. త్వరలోనే నాగబాబు కూడా జాయిన్ కావడం ఖాయమని తెలుస్తోంది. అప్పటివరకూ రోజా, మీనా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారన్నారని తెలుస్తుంది.