సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి ప్రీ రిలీజ్ వేడుక నిన్న గ్రాండ్ గా హైదరాబాద్ లో జరిగింది. మ‌హేష్‌బాబు కెరీర్‌లో మైల్‌స్టోన్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమ‌కు వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. పూజా హెగ్డే హీరోయిన్‌. ఈ వేడుక‌లో హీరోయిన్ పూజ మాట్లాడుతూ మ‌హేష్‌ను ఆకాశానికి ఎత్తేసింది. మ‌హేష్‌లాంటి సూప‌ర్‌స్టార్‌తో చేయ‌డం ఎంతో అదృష్ట‌మ‌ని చెప్పుకొచ్చింది. అలాగే పూజ ఇచ్చిన ఓ స‌ల‌హా విష‌యంలో మాత్రం మ‌హేష్ వెంట‌నే సీరియ‌స్‌గా తిర‌స్క‌రించ‌డం ఒక్క‌సారిగా ఫంక్ష‌న్‌ను హీటెక్కించింది.


పూజ మాట్లాడుతూ ముందుగా మ‌హేష్‌పై ప్ర‌శంస‌లు కురిపించాక‌... 25 సినిమాలు చేసిన అనుభ‌వం ఉన్న మ‌హేష్‌బాబు గారిలో మంచి ద‌ర్శ‌కుడి కోణం కూడా ఉంద‌ని చెప్పింది. ఆయ‌న‌లో మంచి ఆలోచ‌నా ప‌రుడు ఉన్నాడ‌ని.. ఆయ‌న ప్ర‌తి స‌న్నివేశాన్ని వినే విధానం, చూసే కోణం చాలా కొత్త‌గా ఉంటుంద‌ని చెప్పింది. అందుకే ఆయ‌న‌లో మంచి ద‌ర్శ‌కుడు ఉన్నాడ‌ని తాను భావిస్తున్నానంది.


ఈ వ్యాఖ్య‌ల‌పై కాస్త సీరియ‌స్‌గానే స్పందించిన మ‌హేష్ ఇండ‌స్ట్రీలో ఎవ‌రి ప‌నులు వారు చేస్తేనే మంచిద‌ని... త‌న‌కు ద‌ర్శ‌క‌త్వంపై ఎలాంటి ఆస‌క్తి లేద‌ని కూడా చెప్పేశాడు. మ‌హేష్ ఈ విష‌యం ఇంత‌లా స్పందించ‌డానికి కార‌ణాలు కూడా లేక‌పోలేదు. పూజ ఈ రోజు త‌న మ‌టుకు ఓ మాట అనేసి వెళ్లిపోతుంది. మ‌హేష్ దీనిపై మాట్లాడ‌క‌పోతే డైరెక్ష‌న్ శాఖ‌లో మ‌నోడు వేలు పెట్టేస్తున్నాడంటూ ఇండ‌స్ట్రీ అంతా టాం టాం అయిపోతుంటుంది.


ఇప్ప‌టి వ‌ర‌కు ఇండ‌స్ట్రీలో చాలా మంది హీరోలు ద‌ర్శ‌కుల ప‌నిలో వేలు పెడుతున్నారంటూ విమ‌ర్శ‌లు తెచ్చుకుంటున్నారు. ఇందులో స్టార్ హీరోలుగా ఉన్న బాల‌య్య‌, మ‌హేష్‌బాబుకు మంచి పేరు ఉంది. ఇప్పుడు కూడా త‌న‌పై ఆ రిమార్క్ లేకుండా ఉండేందుకే క్లారిటీ ఇచ్చాడ‌ని టాక్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: