ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడ చూసినా మహేష్ మానియా పట్టుకుంది.  మహేష్ మహర్షి మూవీ విడుదలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. వచ్చే గురువారం మే 9న విడుదల డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి.  ఇప్పటికే యు/ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న మహర్షి సినిమాలో కొన్ని సన్ని వేశాలు హైలెట్ గా నిలవబోతున్నాయని చెబుతున్నారు.  ఈ మద్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమయంలో సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ఒక్క విషయం నేను చెప్పకుండా ఉండలేక పోతున్నానని..ఈ సినిమా అంత ఒక ఎత్తైతే క్లయిమాక్స్ మరో ఎత్తని అన్నారు.  


అసలు క్లయిమాక్స్ చూసి కంట తడి పెట్టి థియేటర్ నుంచి ఎవ్వరూ రారని..గుండెలు కదిలించేలాంటి సన్నివేశం క్లయిమాక్స్ లో చిత్రీకరించారని అన్నారు. క్లైమాక్స్ లో హీరో వెంట వేలమంది రైతులు వచ్చే సీన్, ఆ సమయంలో వచ్చే పాట మరో స్థాయిలో ఉంటుందట. అల్లరి నరేష్ ఎపిసోడ్ తో పాటు పూజ – అల్లరి – మహేష్ మధ్యన వచ్చే స్నేహ సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించాడని మహర్షి టీం చెబుతుంది.

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే రామవరం ఎపిసోడ్ బాగుంటుందట.  రిజిస్టార్ ఆఫీస్ లు రైతుల భూముల సీన్ ఆకట్టుకుంటుందని సెన్సార్ సభ్యుల ద్వారా తెలుస్తోంది.  సాయి కుమార్, మహేష్ బాబుల మధ్య వచ్చే సీన్ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందట. విలన్ తో హీరో సవాల్ చేయడం మహేష్ ఫ్యాన్స్ ని ఈలలువేసేలా చేస్తుందని చెబుతున్నారు.  మొత్తానికి ఈ సినిమా మంచి సందేశాత్మక చిత్రానికి కమర్షియల్ హంగులు జోడించి ఈ సినిమా తీశారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: