బాలీవుడ్ బ్యూటీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్ ద‌ర్శ‌కుడు అనురాగ్ బ‌సుతో ‘ఇమిలీ’లో న‌టించాల్సి ఉంది. కానీ డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో కంగనా చాలా స్మూత్‌గా ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది. ఆమె స్థానంలో దీపికాప‌దుకొనే అయితే బావుంటుందని అనురాగ్‌ బసు భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి.


ఇటీవ‌లె పాత్రికేయుల స‌మావేశంలో ఈ చిత్రం నుంచి తప్పుకోవడం గురించి కంగనా మాట్లాడుతూ– ‘‘ఇమిలీ’ సినిమాలో నా మెంటర్‌తో మళ్లీ కలిసి పనిచేసే అవకాశం దొరికింది అనుకున్నాను. కానీ కుదరడం లేదు. డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డంతో అనురాగ్‌గారితో మాట్లాడాను. ఆయన నా పరిస్థితి అర్థం చేసుకున్నార‌ని చెప్పింది. ‘ఇమిలీ’ చిత్రాన్ని 2018 నవంబర్‌లో మొద‌లు పెట్టాల్సింది. కానీ కంగన ‘మణికర్ణిక’ సినిమాతో, నేను మరో ప్రాజెక్ట్‌తో బిజీ అయ్యాం. ప్రస్తుతం ‘పంగా’ సినిమా చేస్తోంది. మళ్లీ త్వరలోనే మేం కలసి సినిమా చేస్తాం అని ద‌ర్శ‌కుడు తెలిపారు.


ఇటీవల దీపికాను అనురాగ్ బసు కలిశార‌ని స‌మాచారం.  స్క్రీప్టును విని దీపికా పదుకోన్ సానుకూలంగా స్పందించారని బాలీవుడ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.  కంగనా  ఆలోచ‌న‌ల్నీ చాలా క్రియేటివ్ గా ఉంటాయి. హీరోయిన్‌గానే కాక ద‌ర్శ‌కురాలిగా కూడా మ‌ణిక‌ర్ణిక చిత్రంతో మంచి పేరును సంపాదించుకుంది. 


అయితే సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యం అవుతుందనే కారణంతోనే నేను ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చానని దీపికా పదుకోన్ వెల్లడించింది. ప్రస్తుతం దీపికా పదుకోన్ చపాక్ అనే చిత్రంతో బిజీగాఉన్నారు. అలాగే మేఘనా గుల్జార్ చిత్రంలో కూడా ఆమె నటిస్తున్నారు. అయితే ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత ఇమ్లీ సినిమాలో నటించే అవకాశం కనిపిస్తున్నది.




మరింత సమాచారం తెలుసుకోండి: