సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమాగా వస్తున్న భారీ బడ్జెట్ మూవీ మహ్ర్షి. గురువారం రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈరోజు రాత్రి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే ఈ సినిమాకు ఆల్రెడీ రివ్యూ ఇచ్చేసి 4 రేటింగ్ ఇచ్చాడు. సినిమా యూ.ఏ.ఈలో ఉమైర్ సంధు ఆల్రెడీ చూశానని అద్భుతంగా  ఉందని ట్వీట్ చేశాడు. 


మహేష్ మూడు వేరియేషన్స్ లో నటన.. దర్శకుడు సోషల్ థ్రిల్లర్ కథ.. కథాంశం.. స్క్రీన్ ప్లే చాలా సరదాగా సాగిందని మహర్షి ఫస్ట్ రివ్యూ ఇచ్చాడు. అయితే ఉమైర్ సంధు 4 రేటింగ్ పై మహేష్ ఫ్యాన్స్ లో అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ఇదవరకు కూడా ఇలానే ఓవర్ ఎక్సైట్మెంట్ తో చాలా సినిమాలకు మంచి రేటింగ్ ఇచ్చాడు. 


కాని అవేవి బాక్సాఫీస్ దగ్గర నెగ్గలేదు. సూపర్ హిట్ అంటూ అతని చెబితే ఇక్కడ డిజాస్టర్ గా అయిన సందర్భాలు ఉన్నాయి. ఉమైర్ సంధు రివ్యూని పట్టించుకోవడం మానేశారు తెలుగు ఆడియెన్స్. అయితే మహర్షి విషయంలో ముందునుండి చిత్రయూనిట్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. అందుకే సినిమా కూడా పక్కా హిట్ అన్నట్టుగా అనిపిస్తుంది.


గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి ఇస్తుందో మరొక్క రోజు వెయిట్ చేస్తే సరిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: