సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన  తాజా చిత్రం "మ‌హ‌ర్షి" సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. యువ దర్శకుడు  వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఇక ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి.prasad NUVVILAA' target='_blank' title='click here to read more about prasad NUVVILAA'>ప్రసాద్ నిర్మించారు. ఇక మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. 

అయితే మే నెల అంటే మహేష్ అభిమానులకు చాలా భయం అని చెప్పాలి, ఎందుకంటే వారికీ మే లో "నిజం" "నాని" "బ్రహ్మోత్సవం" లాంటి భారీ డిజాస్టర్స్ ని మహేష్ మేలోనే అందించాడు. దీంతో మే అనగానే మహేష్ అభిమానుల గుండెలో ఎదో సందేహం ఏర్పడక మానదు. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారారంలో విడుదల అవ్వలిసింది ఏప్రిల్ మహేష్ కి ఎంతో కలిసొచ్చిన నెల మహేష్ సూపర్ హిట్స్ అయినా "పోకిరి" "భరత్ అనే నేను" చిత్రాలు భారీ బ్లాక్ బ్లాస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కానీ అనుకోని విధంగా మే లో విడుదల అనగానే మహేష్ అభిమానులు భయపడుతున్నారు. 

అయితే వైజయంతి మూవీస్ కి మే 9 న "జగదేక వీరుడు అతిలోక సుందరి" "మహానటి" లాంటి క్లాసిక్స్ ని అందించిన రోజు అలానే ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి వెంకటేష్ ముఖ్య అతిధిగా వచ్చారు, వెంకీ అతిధిగా వచ్చిన "జెర్సీ " "మజిలీ" చిత్రాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, దీంతో ఈ సినిమా కచ్చితంగా హిట్ అవవుతుందనే ఆశతో ఉన్నారు మరికొందరు. మరి "మహర్షి" ఫలితం ఏమవుతుందో  తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: