రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి దేశవ్యాప్తంగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ కళ్యాణ్ త్వరలో నటిస్తాడు అని ప్రచారంలోకి వస్తున్న మైత్రీ మూవీస్ సినిమాను అసలు ప్రారంభం కాకుండానే ఆమూవీని ‘పికె ఆర్ ఆర్ ఆర్’ అంటూ ఒక కొత్త ట్యాగ్ తో పవన్ అభిమానులు ప్రమోట్ చేస్తున్న విషయం సంచలనంగా మారింది.

ఆంద్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత మాత్రమే పవన్ నటించే సినిమాల గురించి క్లారిటీ వస్తుంది. అయితే అప్పటి వరకు ఆగే స్థితిలో పవన్ అభిమానులు కనిపించక పోవడంతో ఈ కొత్త ట్యాగ్ ప్రచారంలోకి వచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో మహేష్ పారితోషికం మాత్రమే 25 కోట్ల స్థాయిలో ఉంది. 

జూనియర్ చరణ్ అల్లు అర్జున్ ల పారితోషికం మహేష్ రేంజ్ లో లేదు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే అతడు నటిస్తున్నవి అన్నీ సొంత సినిమాలు కాబట్టి పారితోషిక ప్రస్తావన ఉండదు. దీనితో రాజకీయాలు వదిలి తిరిగి సినిమాల బాటపడితే పవన్ కు మైత్రీ మూవీస్ సంస్థ 30-35 కోట్ల మధ్య పారితోషికం ఆఫర్ చేసింది అని వస్తున్న వార్తలు పవన్ అభిమానులకు విపరీతమైన జోష్ ను కలిగిస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ప్రస్తుతం మైత్రీ మూవీస్ సంస్థ చాలామంది టాప్ దర్శకులకు అదేవిధంగా మిడిల్ రేంజ్ హీరోలకు ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి తీసుకుంటోంది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో జరుగుతున్న ఈ తతంగం అంతా పవన్ కళ్యాణ్ తో ఒక భారీ సినిమాను తీయడానికి మైత్రీ మూవీస్ అనుసరిస్తున్న వ్యూహాలు అంటూ జరుగుతున్న ప్రచారం చూస్తుంటే పవన్ ఖచ్చితంగా ఈ సంవత్సరాంతంలో మైత్రీ మూవీ బ్యానర్ లో నటించడం ఖాయం అని అనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: