విద్యాబాలన్ మంచి నటిగా పేరుతెచ్చుకున్న హీరోయిన్, సెలెక్టివ్ గా పాత్రలు ఎనుకకునే విద్య  అలనాటి హాట్ గర్ల్ స్కిల్‌ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన "డర్టీ పిక్చర్‌" సినిమాతో సంచలనం సృష్టించారు. ఇక ఈ చిత్రం ద్వారా జాతియా అవార్డు సైతం అందుకుంది విద్యాబాలన్  

ఇక ఇటీవలే టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ లో నటించారు విద్య. ఎన్టీఆర్ భార్య బసవతారకంగా విద్య నటన అందరి మన్నలను అందుకుంది. ఈ ముచ్చటగా మూడోసారి విద్య మరో బయోపిక్ లో నటించేందుకు రెడీ అవుతున్నారు. హిందీలో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ హుమెన్  కంప్యూటర్‌గా పేరు తెచ్చుకున్న గణిత శాస్త్ర మేధావి శకుంతలా దేవి గారిది. 
 
ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా పేజ్‌లో అధికారికంగా ప్రకటించారు. అను మీనన్‌ దర్శకత్వంలో, విక్రమ్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ సినిమా 2020 వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రం గురించి మరిన్ని  వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: